జననేత్రం న్యూస్ పిఠాపురం రూరల్ ప్రతినిధి//:పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కటం చర్చనీయాంశంగా మారింది..
పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్ సానబోయిన గంగరాజు అనువారి నుండి ఎస్సీ ఎస్టీ కేసు నుండి తప్పించుటకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి పేర్లను తొలగించుటకు రూ. 20,000
లంచం తీసుకుంటూ ఎస్సై అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ వలలో చిక్కారు..
జిల్లా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డి.ఎస్.పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీకి వచ్చిన పక్క సమాచారంతో దాడి చేయగా పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డాడు..
జరిగిన సంఘటనపై కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటీల్ శాఖ పరమైన దర్యాప్తు జరిపి తగు చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు…
C.E.O
Cell – 9866017966