Home Latest News భద్రాచలం శ్రీ జీయర్ మట్ నందు మహిళల ఆరోగ్య వికాసం కోసం వికాస తరంగణి లయన్స్ క్లబ్ భద్రాచలం వారి సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీ లకు గర్భ కోశ వ్యాధుల ఉచిత పరీక్షల శిబిరం ను గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించి ప్రసంగించారు.

భద్రాచలం శ్రీ జీయర్ మట్ నందు మహిళల ఆరోగ్య వికాసం కోసం వికాస తరంగణి లయన్స్ క్లబ్ భద్రాచలం వారి సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీ లకు గర్భ కోశ వ్యాధుల ఉచిత పరీక్షల శిబిరం ను గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించి ప్రసంగించారు.

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్ భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి జూలై03//:ఈ కార్యక్రమం లో సెంట్రల్ కమిటీ మహిళా ఆరోగ్య వికాస్ సమన్వయ కర్త శ్రీమతి మాధవి రవీంద్ర మహిళా బృందం వారు పరీక్షలు నిర్వహించారు. భద్రాచలం VT ఆరోగ్యవిభాగం సమన్వయకర్త
డా. వి.జయభారతి శిబిరాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో
ఇలాంటి స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు ప్రభుత్వం వైపునుండి లేదా తమ నుండి ఏమి సహాయం కావాలన్నా అందచేస్తామని స్థానిక శాసనసభ్యులు డా. తెల్లం వెంకటరావుతెలియచేశారు..స్త్రీల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని డా. జయభారతి తెలిపారు. స్త్రీల ఆరోగ్య వికాసం కోసం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు నిర్వహిస్తున్న వైద్య సేవలు ,శిబిరాలను గురించి మాధవీ రవీంద్ర వివరించారు.
భద్రాచలం పురప్రముఖులు బి హరిచంద్ర నాయక్,వికాస తరంగిణి ముఖ్య సమన్వయ కర్త,లయన్స్ అధ్యక్షురాలు శ్రీమతిపిన్నింటికమలరాజశేఖర్,ఆరోగ్య వికాస్, యువవికాస్, ఆర్ధికప్రజ్ఞాసమన్వయకర్తలు ,చారుగుళ్లశ్రీనివాస్,గుడికందుల నాగేశ్వరరావు,చిట్టే లలిత, జీయర్ మఠం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు గట్టు వెంకటాచార్య,నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి, ఇలాకి రంగారెడ్డి,
వికాస తరంగిణి జిల్లా కన్వీనర్ శ్రీమతి రోజా,లయన్స్ zc కురిచేటి శ్రీనివాస్,లయన్స్ ప్రధాన కార్యదర్శి సిద్ధారెడ్డి,లయన్స్ రామలింగేశ్వరరావు,భీమవరపు వెంకటరెడ్డి,గాదె మాధవ రెడ్డి,శ్రీమతి సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ శిబిరంలో 160 మంది మహిళలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయడం వలన అందులో కొందరికి సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, వీరికి తగు వైద్య సహాయం గురించి అందచేగడానికి శ్రీ జీయర్ మఠం ద్వారా తగు శ్రద్ధ తీసుకుంటామని శ్రీ జీయర్ మఠం నిర్వాహకులు తెలిపారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird