జననేత్రం న్యూస్ చేగుంట మండలం ప్రతినిధి జులై03*//:కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్.బి గెస్ట్ హౌస్ లో కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ కోసం చేగుంట మండల కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, సమావేశం నిర్వహించడం జరిగింది.
టి పి పి సి బొమ్మ మహేష్ కుమార్ పిలుపుమేరకు రేపు జరగబోయే మహాసభకు ముఖ్య అతిధిగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే వస్తున్న తరుణంలో చేగుంట మండలం నుండి అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, 150 నుండి 200 మంది కార్యకర్తలు వెళ్లి సభను విజయవంతం చేస్తాం చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండ శ్రీనివాస్, మోజామిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్, నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు బోయిని శ్రీకాంత్, సీనియర్ నాయకులు పూర్రా ఆగం మహిళా కాంగ్రెస్ నాయకురాలు కురుమ లక్ష్మి, నాగులు, రాకేష్ రాంపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966